.:: నా గురుంచి నేను ! ::.


AISF కార్యకలాపాల్లో, రాజకీయ పాఠశాలల్లో పాల్గొన్నాను. ఊహ వచ్చినప్పటి నుండి సిపిఐ ఉద్యమాలు, సాహిత్యం, పత్రికల ప్రభావం ఎక్కువ.

Read more...

Bathula VV Apparao

Readers Comments

No comments
Thanks to one and all who read my books and sent your valuable comments on it.

.:: Below are the list of Reader's Comments ::.
=========================================================== Venkatesu Gaduputi says: my Hearty thanks sir For marvelous presentation of truth. Everyone should realize the truth through going your mircheele mircheelu. I wish reader should go through with open mind to feel the greatness of messages. =========================================================== Ramakrishna Atmakuru says: ఈ వేసవి ఎండకు మల్లే మెదడును సుర్రున తాకుతున్నాయి ... మీ ప్రతి మాట =========================================================== Saatyaki says-- Namaskaram Mee Kavitwam linkulu pampinanduku kruthajnathalu Mee Mircheelu entha ghaatugaa unnaayo antha bhaavasphorakamgaa kooda unnaayi. Idee mee kavitha prathyekatha Neti kaalam lo rachanallo samajam undigaanee bhaavukatha koravadindi. Meeraa lotunu poorthika theerustunnaaru. Haardika Abhinandanalu-- saatyaki ===========================================================
మిర్చీ కవిత్వంలో పక్షులు, మనుషులు--తంగిరాల చక్రవర్తి, సాహితీ కిరాణం మాస పత్రిక, మార్చి 2016 సంచిక
 మిర్చీ కవిత్వంలో పక్షులు,మనుషులు
పెద్దూరి  వెంకట దాసు సంపాద కత్వంలో వెలువడిన ఈ కవితా సంపుటిని రావి రంగారావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకంలో ని ఏక వాక్య కవితలన్నీ అద్భుత భావ దారలతో ఉన్నాయి. “నిన్న జై జై సత్యం, నేడు జైలు సత్యం”, “ట్వెంటీ ట్వెంటీ కాదు, ఫోర్ ట్వెంటీ” అంటూ క్రికెట్ మర్మాలు ఏక వాక్యంలో చెప్పారు బత్తుల వీవీ అప్పారావు. తెలుగు సాహిత్యంలో వామన కవితల్లో ఈ ఏక వాక్య మిర్చీ కవితలు విశిష్ట స్థానం పొందు తాయి. “ఊరితే నుయ్యి, ఆగితే గొయ్యి”, “వోటింగ్ పవిత్రం, వి ఐ పీ లకు స్పెషల్ క్యూలు ఉండవు” అని మనుషు లపై మిర్చీలు విరజిమ్మారు.

పక్షులపైన మిర్చీలలో కొన్నిటిని చూద్దాం. “అడవులే స్వర్గం, నరికితే నరకం”. “చీమలు నిద్ర పోవు. అవి 24 x 7 శ్రమ జీవులు”. “జంతువులది గడ్డి, మనుషు లది నానా గడ్డి”. ఈ పక్షుల విభాగాన్ని ముత్తేవి రవీంద్రనాథ్ గారికి అంకితం చేశారు. ఎన్. వి. రఘు వీర్ ప్రతాప్, పెద్దూరి వెంకట దాసులు ముందు మాటలు రాశారు. మనిషి మానవతను కలంతో పలకరించే బత్తుల వారికి అభినందనలు—తంగిరాల చక్రవర్తి, సాహితీ కిరణం మాస పత్రిక, మార్చి 2016 సంచిక
===========================================================
 అర్థవంత మైన అక్షర మిర్చీలు --తంగిరాల చక్రవర్తి (వార్త దిన పత్రిక 28/2/2016 నుంచి)
అర్థవంత మైన అక్షర మిర్చీలు

“మనుషులపై/పక్షులపై మిర్చీలు” పేరిట బత్తుల వీవీ అప్పారావు వెలువరించిన మినీ కవితా సంకలనం లోని కవితలు అర్థవంతంగా ఉన్నాయి. మనుషులపై మిర్చీల్లో మచ్చుకు కొన్ని: “కథల్లో కారా, రాతల్లో చేరా, అని పిస్తారు ఔరా. “కొడుకు పుట్టాడు, లెనిన్ అవుతాడో, లాడెన్ అవుతాడో”. ఇక పక్షులపై మిర్చీల్లోఏనుగులది జంతు ప్రేమ, మాంసాహారం ముట్టవు. నిన్న అడవుల్లో, నేడు జూల్లో, రేపు బొమ్మల్లో—పక్షులు, జంతువులు”. సహిస్తే గొర్రెలు. కలహిస్తే గొరిల్లాలు. ఇలా ఏక వాక్య కవితలు పాఠ కుల్ని అలరిస్తాయి-- తంగిరాల చక్రవర్తి (వార్త దిన పత్రిక 28/2/2016 నుంచి) 

===========================================================
 ఎస్‌ఆర్ పృధ్వి
ఆత్మీయ మిత్రులు శ్రీ బత్తుల వీవీ అపారావు గారికి నమస్సులు.

ఉభయ కుశ లోపరి. మీరు పంపిన మనుషులపై మిర్చీలు అందడం, చదవడం జరిగింది. మంచి రచన. ఏ దైనా ఉపన్యాసం లో గాని, వ్యాసంలో గాని ఉదహరించేందుకు ఉపకరించే అంశాలు చాలా కనిపించాయి. అభినందనలు. ఈ సారి వచ్చినప్పుడు తప్పక కలుస్తాను-- ఎస్‌ఆర్ పృధ్వి
===========================================================
 డా. సి నారాయణ రెడ్డి
అభినందన
బత్తుల వివి అప్పారావు గారికి,
మీరు రచించి ప్రచురించిన మనుషులపై/పక్షులపై మిర్చీలు గ్రంథాన్ని అందుకున్నాను. సంతోషం. మీ గ్రంథంలో సూక్తులున్నాయి. ఘాటైన చలోక్తు లున్నాయి.
నిత్య జీవితం లో సందర్భోచితం గా ఉదహరించదగిన  పంక్తులెన్నో వున్నాయి. మీ వినూతన రచనా శక్తికి నా ఆశీరభి నందనలు. ఉంటాను--డా. సి నారాయణ రెడ్డి
===========================================================   
KL Ranganatharao
Dear Sri Bathula VV Apparao,

Namaste.  Received your book “manushulapai mircheelu” and “pakshulapai mircheelu”. The book is good, humorous, informative and educative also. Thank u very much.  As per my calculation 412+1283 =1695 quotations are in your book. I want to translate after selection 500 or 600 quotations into Kannada, if possible by book form before January or February 2016. Today Mr A Bhaskar talked to me by phone to send mircheelu for meanings. Now I wish to state that I have Telugu-English Dictionary. So I will manage myself for meanings. So please send permission  letter to translate the book into Kannada language—KL Ranganatharao.
===========================================================   
మిర్చి మసాలా -- R అనంత పద్మనాభ రావు 
మిర్చి మసాలా
కవి భావుకుడు. భావుకతకు ప్రతిభ, వ్యుత్పన్నత అవసరం. సాధన ద్వారానే అది సాధ్యం. తిర్యగ్జంతువులకు మానవులకు వున్న తేడా ఏమీ లేదు. ఆహార నిద్ర భయ మైధునాలు సమానం. కానీ మానవుడికి బుద్ధి బలాన్ని ప్రసాదించాడు భగవంతుడు. ఆ బుద్ధి బలాన్ని  కొందరు కవితలలోను, మరికొందరు చిత్రాలలోనూ, మరి కొందరు సంగీతం లోనూ వికసింప చేస్తారు. అట్టి వారిలో  అప్పారావు ప్రముఖులు.
సమసమాజ స్థాపన ధ్యేయంగా సామ్యవాద సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పదిమందికి సహకరించే      కళ్యాణ వేదికలు ఏర్పాటు చేశారు. ఈ గ్రంథ ద్వంద్వం లో పక్షుల నుద్దేశించి నాలుగు వందల కు పైగా మిర్చీలు ధట్టించారు.
“పుట్టల్లో పాములు, పాలిటిక్స్ లో స్క్యాములు” అనే ఒక్క మిర్చీకి భగవత్ గీత కున్నంత వ్యాఖ్యానం చేయవచ్చు. వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు లాక్షణికులు. ఈ రెండు పద బంధాలలో అప్పారావు తన సమాజ రుణాన్ని తీర్చుకున్నారు.
కళ్ళు మూస్తే పడక, కన్ను మూస్తే పాడె” అనే వైరాగ్య భరిత వ్యాఖ్య తల పండిన పీఠాధిపతులు, రుషితుల్యులు చెప్ప గలిగిన మాట.  ఎంత శ్రీ మంతుడైనా స్మశాన ప్రయాణం చేయక తప్పదు. ఎంతటి ఆత్మీయత, అనుబంధం కలిగిన బంధువునైనా చనిపోయిన 24 గంటలలో అంతిమ ప్రయాణానికి సిద్ధం చేస్తారు. బ్రతికి వున్నంతలో అతడు చేసిన మేలు మాత్రమే లోకం లో మిగిలి పోతుంది.
భావ బలం, అక్షర సంపద ఉంటే తప్ప ఆలతి ఆలతి పదాలలో అక్షర రమ్యత చూపడం సాధ్యం కాదు. అధ్బుతమైన భావ ప్రవాహంలో గంగా ఝరి లా ప్రవహించిన కవితా రస ధార ఈ సంపుటి.
పదాలు వాటి అంతట అవే అహమహమికలో పరుగులు తీశాయి. వీరి కలం మరింత ప్రగాఢమై తెలుగు జాతికి మరింత ఘాటైన మిర్చీమసాలా అందించాలని ఆకాంక్ష—డా. ఆర్ అనంతపద్మనాభ రావు.  
===========================================================   
మిర్చీ కవిత్వంలో పక్షులు, మనుషులు--శ్రీ తంగిరాల చక్రవర్తి 
మిర్చీ కవిత్వంలో పక్షులు, మనుషులు


పెద్దూరి వెంకట దాస్ సంపాదకత్వంలో వెలువడిన ఈ కవితా సంపుటిని మినీ కవితా ఉద్యమ పితామహులు శ్రీ రావి రంగారావు గారికి అంకితం చేసారు. ఈ కవి గారు వామన కవితలు వేలల్లో రాసి ప్రఖ్యాతి నొందారు.

వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు పెద్దలు. ఏక వాక్య కవితలు గతంలో కొందరు కవులు రాసారు. ఎవరి ప్రత్యేకత వారిది. బత్తుల వారి కవితలు మిర్చీలు’. ఎంతో అద్భుత భావ ధారల్తో ఉన్నాయి.

నిన్న జై జై సత్యం, నేడు జైలు సత్యం”,
ట్వంటీ ట్వంటీ కాదు ఫోర్ ట్వంటీ

అంటూ క్రికెట్ స్టార్స్ మర్మాలు ఏక వాక్యంలో విప్పి చెప్పారు. సి.వి., అద్దేపల్లి, ఆ తర్వాత కాలంలో రావి రంగారావు గారలు ఈ మినీ కవితల్ని విస్తృతం చేసారు. తెలుగు సాహిత్యంలో వామన కవితల్లో ముఖ్యంగా ఈ ఏక వాక్య మిర్చీ కవితలు విశిష్ట స్థానం పొందుతాయి. చిరాకు, అలసట, అనారోగ్యం, కోపం,భయం, బాధ కలిగే హృదయాలకి అక్షర టానిక్కులు ఈ కవితలు.  మీరూ పుస్తకం కొని తెప్పించుకోండి. రెండు జండూబాం సీసాలు ఇవ్వలేని స్వస్థత ఈ చిరు పొత్తం ఇస్తుంది. కొన్ని కవితలు  మిర్చీలు మీ ముందు పెడుతున్నాను. ఆరగించండి, ఆనందించండి:

ఊరితే నుయ్యి, ఆగితే గొయ్యి” (పేజీ 9)
ఒకటి ఒకటి కలిస్తే రెండు, మనిషి మనిషి నిలిస్తే పదకొండు” (పేజీ 11)
పండితే పత్తి, రాలితే మిత్తిపత్తి రైతుకి” (పేజీ 34)
బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పాలించారు, అమెరికా వాళ్ళు అక్కడ ఉండే పాలిస్తారు” (పేజీ 45)
వోటింగ్ పవిత్రం, వి.ఐ.పీ.లకు స్పెషల్ క్యూలు ఉండవు. (పేజీ 61)
వాన నీటిని ఒడిసి పట్టుకొంటె ప్రతీ పురం పోలవరం’, ప్రతీ నగరం నాగార్జున సాగరమే” (పేజీ 60)

పక్షులపై మిర్చీలు లో కొన్నింటిని చూద్దాం:
అడవులే స్వర్గం, నరికితే నరకం” (పేజీ 1)
ఒంటిలో ఫ్యాట్, ఇంటిలో ర్యాట్కష్టాలకి మూలం” (పేజీ 5)
చీమలు నిద్రపోవు, అవి 24 X 7 శ్రమ జీవులు
జంతువులది గడ్డి, మనుషులది నానా గడ్డి” (పేజీ 11)
నిన్న అడవుల్లో, నేడు జూల్లో, రేపు బొమ్మల్లోపక్షులు, జంతువులు (పేజీ 13)
లక్ష్మి వాహనం గుడ్ల గూబ. లక్ష్మి వచ్చినా, వెళ్ళినా చడీ చప్పుడు చెయ్యదు, గుడ్ల గూబలా” (పేజీ 21)

ఈ పక్షుల విభాగాన్ని ముత్తేవి రవీంద్ర నాథ్ గారికి అంకితం చేసారు. ఎన్.వి. రఘువీర్ ప్రతాప్ ముందు మాట రాసారు. పెద్దూరి వెంకట దాసు, రావి రంగారావు, రాధాకృష్ణ ఉప్పల గార్లు చాలా విలువైన ముందు మాటలు రాసారు. సుగంబాబు గారి ముందు మాట బాగుంది. మనిషి, మానవతను కలంతో పలవరించే బత్తుల వారికి అభినందనలు—“తంగిరాల
 
===========================================================   
 sri peddi sambasivarao

===========================================================   
 sri peddinti seshubabu

===========================================================   
 కొత్త నడక నేర్చిన కవితలు ఈ మిర్చీలు --ఉజ్వల, విశాలాంధ్ర, 13 డిసెంబర్ 2015
కొత్త నడక నేర్చిన కవితలు ఈ మిర్చీలు
స్వల్ప పదాలతో అనల్ప మైన అర్థాలను చెప్ప గల కవితలంటే ఎక్కువ మంది మక్కువ చూపిస్తుంటారు. అయితే అవి రాయడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా మినీకవితలు.  చాలా మంది ఈ మినీ కవితలను తమ కిష్టమైన పేర్లను పెట్టుకుని రాస్తూ పాఠకులను అలరిస్తున్నారు. అలాగే  బత్తుల వీవీ అప్పారావు గారు తన మినీ కవితలకు “మిర్చీలు” అని పేరు పెట్టుకున్నారు. మిర్చీ అనగానే ప్రతి ఒక్కరికీ ఘాటు గుర్తుకొస్తుంది. అలా ఘాటు తగిలే విధంగా “మనుషులపై మిర్చీలు”, “పక్షులపై మిర్చీలు” పేర్లతో పాఠకులకు అందించారు. మనుషులపై మిర్చీలలో సమాజం గురించి, విభిన్న మనస్తత్వాల మనుషుల గురించి తెలిపితే, “పక్షులపై మిర్చీలు”లో ప్రకృతి గురించి, పక్షుల గురించి రాసి అలరించారు. అంతే కాదు సమాజంలో ప్రముఖమైన ఆరోగ్యం, వైద్యం, శుభ్రత తదితర పలు అంశాలపై సరికొత్త రీతిలో పాఠకులకు అందించారు. సంక్షిప్తత ప్రధానమైన ఈ మినీ కవితలలో ఆ ధర్మాన్ని చక్కగా పోషిస్తూనే చక్కని కవితలతో పాఠకులను అలరిస్తారు.

“మనుషులపై మిర్చీలు”లో “అజ్ఞానం అల్పాయుష్కు, విజ్ఞానం  దీర్ఘాయుష్కు” అంటూ విజ్ఞానం  గొప్పతనాన్ని చెబుతారు. నేటి కాలానుగుణంగా “అప్పు చేసిన వాడు అధిక సంపన్నుడు, అప్పు తీర్చిన వాడు అల్ప సంపన్నుడు” అని బ్యాంకుల్లో కోట్లల్లో అప్పు చేసి ఎగ్గొట్టే వారి గురించి వ్యంగ్యంగా అందించారు.  అలాగే “అమ్మ ఒడి, సాగు మడి, నేల తడి, చదువుల బడి ఉంటే వెనక బడునా  మనిషి?” అని అంటారు. విజ్ఞతని బోధించే తల్లి, ఆదుకొని బతికేందుకు జీవన మిచ్చే నేల , సాగుతో పాటు సువిశాల ప్రపంచంలో బతికేందుకు ఆధారమయ్యే చదువు ఉంటే ఏ మనిషైనా  సంపన్నుడే. అతను అందరి కంటే ముందుంటాడు అని చాలా గొప్పగా స్వల్ప పదాలతో అనంత అర్థాన్ని అందించారు. జీవితం అన్నది గెలుపు, ఓటముల దోబూచులాట అని తెలిసేలా “ఒక సారి నెగ్గితే జీవితం అంతా నెగ్గేసినట్టు కాదు, ఒక సారి ఒడితే జీవితం అంతా ఓడిపోయినట్టూ కాదు. జీవితం గెలుపు ఓటముల కాంక్రీటు మిక్చర్. అంటూ ఓటమిలో కృంగి పోయే వారికి  చిరోపదేశం చేస్తారు.

“పక్షులపై మిర్చీలు”లో ప్రకృతి గురించి వర్ణిస్తూ “అప్పుడు అక్కడక్కడా మనుషులు, ఇప్పుడు అక్కడక్కడా అడవులు” అంటూ పెరిగి పోయిన జనాభాను  మనిషి నిర్లక్ష్యానికి గురై తగ్గి పోతున్న అడవుల గురించి సూటిగా చెబుతారు. ఆధునికత ఎంతగా పెరిగి పోయిందో చెబుతూ “అప్పుడు పెరటిలో చెట్లు, ఇప్పుడు పెరటిలో కార్లు” అంటారు. కంప్యూటర్ మౌస్ ను ఎలుకతో పోలుస్తూ “ఇప్పుడు హౌస్ హౌస్ లో మౌస్ లే. పిల్లుల్లాగా పట్టుకోవడం,   బల్లుల్లాగా కుర్చీలకు అతుక్కు పోవడం” అంటూ మనిషి ఎంతగా కంప్యూటర్ కు బానిసయ్యాడో చెబుతారు. ప్రకృతి మనిషికి ఎంతో సాయం చేస్తుంది. అది లేనిదే మనిషి బతుకే వ్యర్థం. మనిషి బతకడానికి ఆధారమైన చెట్లపై “మన కోసం పుడుతుంది. మన కోసం పెరుగుతుంది. మన కోసం ఒరుగుతుంది—చెట్టు మనిషి ఆయువుపట్టు” అంటూ వాటిని నిర్లక్ష్యం చేయవద్దని కాపాడుకోమని పరోక్షంగా హెచ్చరిస్తారు. ఆధునిక వస్తువులు మనిషికి వినియోగంగా ఉన్నా వాటి వల్ల మనిషికే కాదు, ప్రకృతికి సైతం ఇబ్బందే అని తెలిసేలా “వృక్షం జీవితాన్ని ఇస్తుంది, ఏసీ జీవితాన్ని తీస్తుంది” అంటారు. వెన్నెముక లేని వాన పాములే నయ మంటూ వాన పాములకి వందనం, పేడ పురుగులకి ప్రణామం. వీటివల్లే పల్లె సీమలు నందన వనం” అంటూ ప్రకృతిలోని చిరు ప్రాణులు సైతం మనిషికి  ఎలా ఉపయోగ పడుతున్నాయో చెబుతారు. కొన్ని పొడుపుకథల్లా గుర్తుండి పోతాయి—ఉజ్వల, విశాలాంధ్ర, 13 డిసెంబర్ 2015

===========================================================   
 వై.రామకృష్ణ
ప్రకృతి పైన , పశు  పక్ష్యాదుల పైన తమ కున్న మక్కువను శ్రీ బత్తుల వీవీ అప్పారావు గారు తమ ఆలోచనలకు తగిన అక్షరాలకు అనుభవం రంగరించి, ఏరి, నైపుణ్యంతో కూర్చి, పేర్చి, వ్యయ ప్రయాసలకోర్చి, కాగితంపై చేర్చి పుస్తక రూపాన్ని ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యసించే వక్తలు ఈ మిర్చీలను తప్పకుండా వాడే స్థాయిలో ఉన్నాయి. మిర్చీలన్నీ బాగా వేయించారు కదా! అందరూ వేయించు కుంటారు.

పక్షులకే భావ ప్రకటనా శక్తి ఉంటే, తమ రెక్కల ద్వారా కరతాళ ధ్వనులు పుట్టించి, పూల మొక్కలేమో సుగంధాన్ని వెదజల్లి తమ కృతజ్ఞతను చాటుతాయి. వృక్షాలేమో వాటి పై మీకున్న పక్షపాతా నికి ఆనందంతో ఉబ్బి పోయి వాటి శాఖలను నలు దిశలా వ్యాపింప చేసి మీ కీర్తి కూడా అలా నలు దిశలా వ్యాపించాలని కోరుకుంటాయి.

ఇది వరలో కరుణ శ్రీ గారు రచించిన “పుష్ప విలాపం” చదివి కొందరు స్త్రీలు పువ్వులు ధరించడం మానేశారని విన్నాను. ఈ పుస్తకం చదివిన వారు కూడా జంతువులను హింసించడం చెట్లను  నరకడం లాంటి చర్యలు చేపట్టే ముందు ఒకటి, రెండు సార్లు ఆలోచిస్తారని అనుకుంటాను. భూమి పై నివసించే హక్కు, మానవులకే కాక జంతువులకు, పక్షులకు, వృక్షాలకూ కలదని చెప్పే మీ ప్రయత్నం హర్షించ తగ్గది. ప్రకృతి రక్షింప బడితే మీ ఆశయం నెరవేరినట్లే--వై.రామకృష్ణ

===========================================================   
మనుషులపై మిర్చీలు – ఎమ్. సీతారావమ్మ
మనుషులపై మిర్చీలు –

ఎమ్. సీతారావమ్మ

(విజ్ఞాన సుధ మాస పత్రిక ,

నవంబర్ 2015 సంచిక)

బత్తుల వీవీ అప్పారావు గారు ప్రతిభకల కవి. కవితా ప్రక్రియలు అనేకం ఉన్నప్పటికీ
వీరికి మినీ కవితలపై అభిమానం మెండు. రావి రంగారావు గారి గురుత్వంలో అనేక
మెళుకువలు  నేర్పుతో సాధించి ఎన్నో పుస్తకాలు ముద్రించి ప్రజల కందించారు.
మనసులోని భావాన్ని కాగితం మీద పెట్టడం వచ్చిన కవి అన్ని ప్రక్రియలలో రచనలు కొన
సాగించాలని కోరు కుంటాడు. ఈ అప్పారావు గారు అల్పాక్షరములతో అనల్పార్థాన్ని
చూపించే మినీ కవితా ప్రక్రియకు దాసోహ మన్నారు. దాని గొప్పదనం అదే. మినీ కవితను
నాడు వామన కవితలన్నా, వామీలన్నా నేడు మిర్చీలన్నా మినీ కవిత పాఠకుని మీద గట్టి
ముద్ర వేస్తుంది, ఆలోచింపచేస్తుంది.  మినీ కవిత మిరియం లా, మిరప గింజలా ఘాటుగా
ఉన్నప్పటికీ ఆలోచింప చేసేదిగా ఉండాలి. యుగాలు మారినట్లే ఈ కవి యుగంలో మనుషులు
సంక్షిప్తతకే పెద్ద పీట వేస్తున్నారు. సంక్షిప్తం గా ఉండి  జన రంజకం గా ఉండే
మినీ కవిత నేడు వ్యవహారం లో సాగుతోంది. అప్పారావు గారు వారి మినీ కవితలకి
మిర్చీలు అని ముద్దు పేరు పెట్టుకున్నారు. పేరు కి తగ్గట్టుగా వ్రాసారు. ఉప్పల
రాధా కృష్ణ గారు   మిర్చి ఘాటు గురించి, దాని జన్మ స్థానం గురించి చాలా
విపులంగా తెలియ చేశారు. “మనుషులపై మిర్చీలు”లో   సమాజం లో జరుగుతున్న స్వార్థ,
అవినీతి అంశాలనే ప్రస్తావించారు. “అన్నం తినే వాడికి జైలు, గడ్డి తినే వాడికి
బెయిల్” ఆలోచిస్తే ఎంతో బోధ పడుతుంది. “అదే భూమి, రేటు కోటి, మనం సాధించింది
ధరల్నే”. అమ్మ భాష అర్థం కానీ వాడికి, ఆంటీ భాష అర్థమౌనా?”,  “అర్థాకలి కన్నా
క్వార్టర్ ఆకలి మిన్న”, “ఇల్లాలు ఎలర్జీ, ప్రియురాలు ఎనర్జీ”, “తెలుగు తల్లి
పాలు, ఇంగ్లిష్ పోత పాలు”. అన్నీ ముత్యాలే, ఎన్నని ఏరను? అందుకే కొన్ని మీ
ముందుంచా, అందరూ చదవండి.

===========================================================       
పక్షులపై మిర్చీలు--ఎమ్. సీతారావమ్మ.
 రచయిత వామ పక్ష భావాలు కలిగిన కామ్రేడ్. అందుకే సమాజాన్ని నిశితంగా పరిశీలించి దోషాల్ని ఎత్తి చూప గలుగు తున్నారు. మానవతా వాది చలించే మనస్తత్వం కరుణరసా పూరితం. అందుకే పక్షులపై మిర్చీలు రాయ గలిగారు. రెండు పాదాలలో ద్విపద ఛందస్సు నడుస్తూ వుంటుంది. అది చందో బద్ధం. కాని మిర్చీలు మినీ కవితలు, స్వేచ్ఛా భావాలు. అప్పారావు ధోరణి విలక్షణమైనది. అందుకే ఈ కవితలకు మిర్చీలు అని పేరు పెట్టారు. ఆరేడు సంవత్సరాలుగా ఈ కవితలను  ఎస్.ఎం.ఎస్.లు గా ఫోనులో పంపుతూ దానికి జనాదరణ కల్గిన తరువాత వాటిని పుస్తక రూపంలోకి తెచ్చారు. మిర్చీలు కదా కొన్ని బజ్జీలు గానూ కొన్ని కారంతోనూ పాఠకుని రంజింప చేస్తాయి. కారం తినని తెలుగు వారుండరు కదా. అలాగే ఇటువంటి కవితలు కూడా చదవని పాఠకులు ఉండరు . అప్పారావు గారి విలక్షణత పుస్తక ముద్రణలో కూడా కనిపిస్తుంది. చాలా మంది చూసి ఉండరు. ఒక వైపు మనుషులపై మిర్చీలు, రెండవ వైపు నుండి పక్షులపై మిర్చీలు ఒక పుస్తకంలో రెండు పుస్తకాలు, ఆర్తనారీశ్వరం అన్న మాట. పక్షుల్ని మనుషుల్ని రెండు కళ్ళతో పరిశీలించారు. అంటే ప్రకృతి, పురుషుడు. వీటికి అవినాభావ సంబంధం ఒకరితో ఒకరు కలసి ఉన్న జీవన విధానాలున్నాయి. సాత్వికమైన జంతువులు జన ప్రవాహంతో పాటు మన తోనే ఉంటాయి. క్రూర మృగాలు అడవులలో ఉంటాయి. చక్కగా చూపించారు రెండు రకాలను. పురి విప్పేది మగ నెమలే. పాట పాడేది మగ కోయిలే, పుంలింగ శబ్దాలకు డు ప్రత్యయం చేరుతుంది. రాముడు రాముడు లాగ.  వీరు కోయిలకు, నెమలికి కూడా  ప్రత్యయం చేర్చి విలక్షణ పదాలు మన    ముందుంచారు. అవే నెమలుడు, కోయిలుడు. ఇక మిర్చీలు చూద్దాం. “అవ్వ గువ్వ ఒకే తీరు. ఎప్పుడైనా ఎగిరి పోవచ్చు”. “ఏనుగులది జంతు ప్రేమ, మాంసం ముట్టవు”. “కూస్తే అలారం, కొస్తే ఆహారం—కోడి”, “క్రూర జంతువు కానిది కూర జంతువే”, “సమస్య అడ్డ గాడిదలతో కాదు, నిలువెత్తు మనుషులతోనే”, “సహిస్తే గొర్రెలు, కలహిస్తే గొరిల్లాలు”, “వలపులో వల ఉన్నది, జాగ్రత్త. ప్రతి కవితా ఆహ్లాద జనకమే, ఆలోచనామృతమే, ఈ మిర్చీలు 412 వున్నాయి—ఎమ్. సీతారావమ్మ. 
===========================================================                   



No comments :

Post a Comment

Location

Contact Me

Feel free to reach me for any information

Address
7/705 Anandini, Divya Sri Sakthi Apts, Mayuri Nagar, Opp. Bus Body Building, Miyapur, Hyderabad 49.

.